కోలీవుడ్ లో ముందుగా ఎంట్రీ ఇచ్చి అక్కడ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్.ఒకప్పటి నటుడు రాజేష్ కూతురు అనే ట్యాగ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముందుగా కోలీవుడ్ లో ఈ అమ్మడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ముందుగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ, తరువాత కాస్తా ప్రాధాన్యత ఉన్న పాత్రలకి ఐశ్వర్య రాజేష్ ఛాయస్ గా మారింది.తరువాత ఏకంగా ధనుష్, విక్రమ్, సూర్య లాంటి స్టార్ హీరోలకి జోడీగా ఈ అమ్మడు కోలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది.
తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందుగానే తమిళ్ లో ఏకంగా 25 సినిమాలని ఐశ్వర్య రాజేష్ పూర్తి చేసింది.ఇన్ని సినిమాల తర్వాత టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఐశ్వర్య రాజేష్ టాలెంట్ ని గుర్తించి అవకాశాలు ఇస్తున్నారు.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఆమె చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది.ప్రస్తుతం ఈ అమ్మడు నాని టక్ జగదీశ్ సినిమాలో నటించింది.
దాంతో పాటు మరో స్టార్ హీరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు ట్యాక్సీడ్రైవర్ అవతారమెత్తారు.
డ్రైవర్ జమున అనే చిత్రంలో నటి ఐశ్వర్యరాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 18 రీల్స్ పతాకంపై డాక్టర్ ఎస్పీ చౌదరి నిర్మిస్తున్నారు.
వత్తికుచ్చి వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన కిన్స్ లిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఉగాది సందర్భంగా చెన్నైలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.
దీనికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.కథ వినగానే ఇందులో నటించడానికి ఐశ్వర్య రాజేష్ వెంటనే అంగీకరించారని సినిమా ప్రారంబోత్సవం సందర్భంగా నిర్మాత తెలిపారు.
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్ కాల్ టాక్సీ డ్రైవర్గా నటిస్తున్నట్లు చెప్పారు.లేడీ ఒరియాంటెడ్ కథతోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.