సీ.బీ.ఎస్.ఈ పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసింది.కరోనా తీవ్రత పెరుగడం.ప్రతిరోజూ వేలల్లో కేసులు నమోదవుతున్న సందర్భంగా జరగాల్సిన సీ.బీ.ఎస్.ఈ పదోతరగతి పరీక్షలను రద్ధు చేయాలని కేంద్రం నిర్ణయించింది.వీటితో పాటుగా 12వ తరగతి బోర్డ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
జూన్ లో పరీహితి సర్ధుమనిగితే అప్పుడు తదుపరి నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ వెల్లడించారు.పరీక్షలు రద్దైన సీ.బీ.ఎస్.ఈ విద్యార్ధులను ఎలా ప్రమోట్ చేస్తారన్నది డౌట్స్ వస్తున్నాయి.
అంతేకాదు 12వ తరగతి పరీక్షలు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో నిర్వహించాలా అన్నది కూడా ఆలోచిస్తున్నారు.
పదో తరగతి బోర్డ్ ఫలితాలు మాత్రం వ్ద్యార్ధుల ఆబ్జెక్టివ్ నైపుణ్యాల ఆధారంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.కేటాయించిన మార్కులతో విద్యార్ధులు సంతృప్తి చెందకపోతే మాత్రం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది.
అసలైతే మే 4 నుండి జూన్ 7 వరకు 10వ తరగతి పరీక్షలు, మే 4 నుండి జూన్ 15 వరకు 12వ తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంతో ఈ పరీక్షలను రద్దు చేస్తున్నారు.12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా వేశారు కాని ఎప్పుడు పెడతారన్నది త్వరలో ప్రకటిస్తారని తెలుస్తుంది.