జాను, శ్రీకారం సినిమాల ఫ్లాప్ తో యువ హీరో శర్వానంద్ డీలా పడ్డాడు.ప్రస్తుతం అజయ్ భూపతి డైరక్షన్ లో మహా సముద్రం సినిమా చేస్తున్న శర్వానంద్ ఆ సినిమాలో సిద్ధార్థ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
ఆరెక్స్ 100 తో మొదటి సినిమానే సూపర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి తన సెకండ్ సినిమాను రేంజ్ కు తగ్గట్టుగానే తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.శర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరికి ఈ సినిమా ప్రత్యేకమైనదిగా ఉంటుందని అంటున్నారు.
ఇక ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత శర్వానంద్ తన నెక్స్ట్ సినిమాను మరో నూతన దర్శకుడితో చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో శర్వానంద్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడట.
శర్వానంద్ ఆల్రెడీ రాధ సినిమాలో పోలీస్ గా చేశాడు.మరోసారి పోలీస్ పాత్రలో అలరించనున్నాడు.
శర్వానంద్ చేస్తున్న పోలీస్ స్టోరీ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.కథ వినగానే శర్వానంద్ ఎక్సయిట్ అయినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ రావాల్సి ఉంది.శర్వానంద్ ఈ పోలీస్ కథ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉంటున్నట్టు తెలుస్తుంది.
జాను, శ్రీకారంతో నిరాశపరచగా మహా సముద్రంతో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు శర్వానంద్. అజయ్ భూపతి మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తుంది.