ఇండియాలో అధికంగా అమ్ముడవుతున్న కార్ల గురించి తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.అయితే ఇండియన్ మార్కెట్ పై మరోసారి తన ప్రతాపం చూపిస్తుంది మారుతి సుజుకి.
ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 కార్లలో దాదాపు అన్ని మారుతి సుజుకి మోడళ్లనే చెబుతున్నారు.మారుతి సుజుకి దేశీయ మార్కెట్ పై తన సత్తా చాటుతుంది.ముఖ్యంగా మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ లాస్ట్ ఇయర్ 1.72 లక్షల యూనిట్లు అమ్ముడుపోయి మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో బాలెనో 1.63 లక్షల యూనిట్లు, వేగనార్ 1.50 లక్షలు, ఆల్టో 1.59 లక్షలు, డిజైర్ 1.28 లక్షలు యూనిట్లు అమ్ముడయ్యి టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి.లాస్ట్ ఇయర్ కార్ల అమ్మకాల్లో 30 శాతం మారుతి సుజుకి వాహనాలే ఉన్నాయి.
టాప్ 5 లో మరే కంపెనీకి ఛాన్స్ ఇవ్వకుండా మారుతి తన హవా కొనసాగిస్తుంది.
మారుతి సుజుకి తమ వెహికల్స్ అమ్మకాల్లో మంచి వృద్ధి రేటు సాధిస్తుంది.దేశ ప్రజలు మారుతి బండ్లనే కోరుతున్నారు.అందుకే ఇయర్ ఇయర్ కు తమ కార్ల అమ్మకాల్లో పర్సెంటేజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. మారుతి కూడా తమ కస్టమర్స్ ను సాటిస్ఫై చేసేలా కొత్త టెక్నికల్ అప్డేట్స్ తో వాహనాలు రూపొందిస్తుంది.
నెల వారిగా కూడా మారుతి సేల్స్ బాగున్నాయి. కొత్త కొత్త మోడళ్లు ఎన్ని వచ్చినా ప్రజలు మాత్రం మారుతికే ఓటేస్తున్నారు.