శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుధవారం 381 గ్రాముల బంగారం అక్రమ రవాణా చేస్తుండగా ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు వాటిని ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణీకుడు సూట్ కేస్ కు ప్రత్యేకంగా సెపరేట్ ఫ్రేమ్ ఏర్పరచారు.
దానిలో బంగారాన్ని దాచి పెట్టారు.ఆ సూట్ కేస్ చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు అందులో బంగారం ఉందని కనిపెట్టారు.దాదాపు 400 గ్రాముల దాకా ఆ బంగారం ఉంటుందని దాని విలువ 13.6 లక్షల దాకా ఉంటుందని చెబుతున్నారు.
అయితే ఆ బంగారం ఎక్కడ నుండి తెస్తున్నారు.ఇక్కడ ఎవరికి ఇస్తారు అన్న దాని మీద ఆ ప్రయాణీకుడిపై కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.సూట్ కేస్ ఫ్రేం లో ఎవరు గుర్తించకుండా బంగారాన్ని అక్రమంగా రావాణా చేస్తున్నాడు సదరు వ్యక్తి.అయితే దుబాయ్ మాత్రమే కాదు అతను తిరిగిన దేశాల లిస్ట్ చాలా పెద్దదే అని తెలుస్తుంది.
దేశాలు తిరిగి వచ్చి చివరకు హైదరాబాద్ లో కస్టమ్స్ వారికి దొరికిపోయాడు.ఇంతకీ అసలు ఆ బంగారం ఎక్కడ నుండి తెస్తున్నారు.
అతను గురించి పూర్తి డీటైల్స్ విచారణలో రాబడుతున్నారు.బంగారం అక్రమ రవాణా కేసులు ఈమధ్య బాగా ఎక్కువవుతున్నాయి.
వివిధ రకాలుగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ కస్టమ్స్ వారికి దొరికిపోతున్నారు.