పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లకు వెళ్లి జనాలు సినిమాను చూసేందుకు కాస్త వెనుకడుగు వేస్తున్నట్లుగా అనిపిస్తుంది.
కరోనా కారణంగా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసి సినిమా కు జనాలను తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు.ఇతర సినిమాలతో పోల్చితే పవన్ కళ్యాణ్ సినిమా ప్రత్యేకం.
కనుక కరోనాను కూడా లెక్క చేయకుండా కొందరు పదండి ముందుకు పదండి తోసుకు అన్నట్లుగా థియేటర్లకు వెళ్తున్నారు.శుక్ర, శని, ఆది వారాల్లో భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి.
కాని సోమవారం వీక్ డే కావడం వల్ల పెదద్గా ఆశలు పెట్టుకోలేక పోయారట.కాని ఉగాది కనుక సెలవు వచ్చింది.
అలాగే అంబేద్కర్ జయింతి కనుక రెండు రోజులు వరుసగా కలిసి వచ్చాయి.
రెండు రోజుల్లో మరో పాతిక కోట్ల వరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఉగాది పండుగ రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కడా మంచి వసూళ్లను నమదు చేయడంతో సినిమా దాదాపుగా 150 కోట్ల వరకు గ్రాస్ ను వసూళ్లు చేసిందని అంటున్నారు.ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ టాక్ తో సంబంధం లేకుండా అన్నట్లుగాక ఊడా కలెక్షన్స్ గురించి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో వకీల్ సాబ్ కు ఈ రేంజ్ లో వసూళ్లు రావడం అంటే అస్సలు మామూలు విషయం కాదు.పవన్ కళ్యాణ్ స్టామినా కే ఇది సాధ్యం అంటున్నారు.
సినిమా మొత్తంగా 150 కోట్ల వరకు రాబట్టడం ఖాయంగా తెలుస్తోంది. మొత్తంగా వకీల్ సాబ్ కు ఉగాది కలిసి వచ్చేలా చేశాడు.