ఆ రాష్ట్రంలో రేపటి నుంచి 144 సెక్షన్ ప్రకటించిన ప్రభుత్వం.. ?

కరోనా ప్రస్తుతం మరోసారి ప్రజల జీవితాలను శాసించే స్దాయికి చేరుకుంటుంది.దీని దాడికి కొన్ని రాష్ట్రాలు అయితే అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.

 Maharashtra Government To Impose 144 Section In The State From Tomorrow, Maharas-TeluguStop.com

కాగా కరోనా విపత్తును తీవ్రంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి.

ఈ రాష్ట్రంలో ఊహించని విధంగా కోవిడ్ కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో రేపటి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.

ఈమేరకు రేపు ఉదయం 8 గంటల నుంచి 15 రోజుల పాటు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నామని, కావున ప్రజలు భారీగా గుమికూడరాదని, ప్రజలు అనవసర ప్రయాణాలు చేయరాదని స్పష్టం చేశారు.

ఇకపోతే మరోసారి కరోనా యుద్ధం ప్రారంభమైందని కాబట్టి కరోనా వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయడానికి ఇంతకంటే మరో మార్గం లేదంటు పేర్కొన్నారు.అయితే దీన్ని లాక్ డౌన్ అని భావించవద్దని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube