విశాఖ శారదా పీఠం స్వరూపానంద స్వామి ఉగాది నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల పై సంచలన కామెంట్స్ చేశారు.ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతకాలు బాగున్నాయి అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు.ఇదే తరుణంలో ఓ అగ్రనేత కి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు.
ప్లవ నామ సంవత్సరం అంటే చీకటిని పారదోలి వెలుగులు నింపే సంవత్సరం అని స్పష్టం చేశారు.
పీఠంలో గంటల పంచాంగం ని ఆవిష్కరించిన క్రమంలో ఈ కామెంట్ చేశారు.
పంచాంగం ఆవిష్కరించక ముందు ఉగాది పండుగ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కామెంట్ చేశారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతకం చాలా బాగుంది.
కాబట్టి.ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఆర్థికంగా పైకి వచ్చే పరిస్థితి ఉందని స్పష్టం చేశారు.
పాలించే రాజు జాతకం బాగుంటే యధావిధిగా ప్రజల జీవితాలలో వెలుగులు కలుగుతాయని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.