సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మహేష్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.అదే జోష్ లో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగింది.ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను డైరెక్టర్ తెరకెక్కించాడు.
అయితే సెకండ్ షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే జరుగుతుందని ముందుగా ప్రకటించారు.
కానీ కరోనా కారణంగా దుబాయ్ లో జరగాల్సిన షూటింగ్ హైదరాబాద్ కు షిఫ్ట్ చేసారు.
ఈ షూటింగ్ మార్చి చివరి వారంలోనే మొదలవ్వాల్సి ఉంది.మొన్నటి వరకు ఈ షెడ్యూల్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలు తెరకెక్కించ బోతున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.కరోనా నిబంధనలను పాటిస్తూ చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించారు.ఈ షెడ్యూల్ ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఫాస్ట్ గా పూర్తి చేసి నెక్స్ట్ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళబోతున్నారు చిత్ర యూనిట్.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంకు మేనేజర్ కొడుకుగా నటిస్తున్నాడు.ఇప్పటికే ఫిలిం సిటీలో భారీ బ్యాంకు సెట్ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నాడు.ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.