మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య సినిమా సిద్దా అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథాంశం టెంపుల్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.
ఇక ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కూడా నక్షల్స్ నాయకులుగా కనిపించనున్నారు.ఇప్పటికే నక్షల్స్ స్టైల్ కాస్ట్యూమ్స్ లో వారిద్దరికి సంబందించిన స్టిల్స్ ని చిత్ర యూనిట్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రివీల్ చేశారు.
ఇక టీజర్, ఓ సాంగ్ ని కూడా రిలీజ్ చేసి సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు.తండ్రి, కొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇక మెగా ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.
ఆ మధ్య రిలీజ్ చేసిన సాంగ్ ద్వారా కాజల్ ని కొరటాల శివ పరిచయం చేసేశారు.
ఇప్పుడు ఉగాది సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డేకి సంబందించిన రొమాంటిక్ స్టిల్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.సిద్దా పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తూ ఉండగా అతని ప్రేయసి నీలాంబరిగా పూజా హెగ్డే కనిపించబోతుంది.ఇక వీరిద్దరి ఎపిసోడ్స్ సినిమాలో 45 నిమషాల పాటు ఉంటుంది.
వీరికి ఒక సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది.ఇక వీరి రొమాంటిక్ స్టిల్ కి సంబదించిన పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయడం ద్వారా ఇందులో హీరో, హీరోయిన్స్ రొమాన్స్ కి కొడవలేదనే టాక్ వినిపిస్తుంది.