ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల విజృంభణ తీవ్రంగా కొనసాగుతోంది.ఇప్పటికే కోవిడ్ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నియమాలను నిరంకుశంగా అమలు చేస్తుండగా, ఈ నిబంధలను పాటించని వారికి జరిమానాలను విధిస్తూ కరోనా రూల్స్ను ఆదాయమార్గాలుగా మలచుకున్నాయి ప్రభుత్వాలు.
ఇదిలా ఉండగా దేశంలో గడచిన 24 గంటలలో నమోదైన కోవిడ్ కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది.వాటి వివరాలు తెలుసుకుంటే.
దేశంలో నిన్న కొత్తగా 1,61,736 మందికి కరోనా నిర్ధారణ అయిందని, వీటితో కలిపి కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,36,89,453 కు చేరిందని పేర్కొంది.
కాగా గడచిన 24 గంటల్లో 879 మంది కరోనా కారణంగా మృతి చెందగా వీరితో కలిపి మృతుల సంఖ్య 1,71,058 కు పెరిగింది.
ఇక కోవిడ్ నుండి నిన్న 97,168 మంది కోలుకోగా, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,22,53,697 మంది కోలుకున్నట్లు, 12,64,698 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుకుంటున్నట్లుగా ఆరోగ్యశాఖ వెల్లడించింది.