కస్టమర్లను ఆకట్టుకోవడానికి హోటల్స్ రకరకాల వినూత్న ప్రయత్నాలు చేస్తాయి.కస్టమర్ లను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా హోటల్స్ రకరకాల వెరైటీలను అందిస్తాయి.
కస్టమర్ లను తిరిగి రాబట్టుకోగలిగితే తాము సక్సెస్ అయినట్టు హోటల్స్ భావిస్తాయి.అందుకు ఇతర హోటల్స్ కు పోటీ ఇచ్చే విధంగా కొత్త కొత్త వంటకాలను సిద్దం చేస్తూ ఇక ఆయా హోటల్స్ కు ఒక వంటకం ప్రత్యేకత ఉండేలా శ్రద్ద తీసుకుంటాయి.
అయితే భోజన ప్రియులందరు ఎక్కువగా ఇష్టపడే దానిలో మొదటి వరుసలో ఉండేది దోశ.దోశలో మనకు చాలా వెరైటీలు మనం చూసే ఉంటాము.
దోశలో ఎన్ని వెరైటీలు వచ్చినా దానికి ఉన్న ఆదరణను ఎవరూ చెరిపివేయలేరు.అయితే ఇందులో ప్రస్తుతం నెట్టింట్లో 916 కేడీఎం దోశ గురించి వైరల్ అవుతోంది.
ఈ దోశ గురించి తెలియగానే నెటిజన్లు ఈ దోశ ప్రత్యేకత గురించి వెతుకుతున్నారంటే ఈ వెరైటీ దోశ ఎంత ఆదరణను చూరగొంటున్నదో మనం అర్థం చేసుకోవచ్చు.అయితే ఈ 916 కెడీఎం దోశ ఖరీదు 916 కేడీఎం లా 916 రూపాయలు దీని ఖరీదు.
అత్యంత పలుచని బంగారుపూతతో కూడిన బంగారపు రేకుని అందిస్తారు.ఈ తరహా దోశ ను ఎక్కడా చూడలేదని కస్టమర్ లు కూడా ఆశ్చర్యపోతున్నారంటే ఈ దోశ నెటిజన్ లను ఎంతగా ఆకట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు.