ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్దితి చాలా దారుణంగా ఉందని అనుకుంటున్నారట.దీనికి కారణం ఆ పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, పోటీ చేసిన నియోజక వర్గాల్లో కలసి కట్టుగా పనిచేయక పోవడం వంటి ఇతర కారణాలతో ఎప్పటికప్పుడు ఓటమిని మూటగట్టుకుంటూ క్రమక్రమంగా కనుమరుగు అవుతుందని భావిస్తున్నారట.
ఇక కాంగ్రెస్ నేతల పై ఉన్న కేసుల విషయాలకు వస్తే.నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఈ సంవత్సరం ఫిబ్రవరి 22న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ పై పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ తో సహా ఈ కేసుకు సంబంధం ఉన్న వారందరికి ఢిల్లీ హైకోర్టు మరింత సమయం ఇచ్చింది. జస్టిస్ సురేశ్ కుమార్ కైట్ కేసు విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చారు.