ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది.రోజురోజుకి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో కరోనా విలయతాండవం చేస్తుంది.ముఖ్యంగా మహరాష్ట్రలో అయితే దేశంలో సగానికి పైగా అక్కడే నమోదు అవుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాలలో కరోనా ప్రభావం మెల్లగా విస్తరిస్తుంది.ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి హోం క్వారంటైన్ లో ఉన్నారు.
అలాగే సినిమాలు షూటింగ్, రిలీజ్ లు వాయిదా వేసుకున్నారు.నైట్ కర్ఫ్యూని మహారాష్ట్ర సర్కార్ అమలు చేస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఇప్పుడు కరోనా టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా తాకింది. వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న నివేథా థామస్ ఆ మధ్య కరోనా బారిన పడి కోలుకుంది.
అలాగే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బందిలో కొంత మందికి కరోనా రావడంతో ఆయన కూడా హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.తాజాగా దిల్ రాజుకి కూడా కరోనా సోకినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే కరోనా సిచువేషన్ కారణంగా సినిమా రిలీజ్ చేసిన పెద్ద సినిమాలకి తప్ప మినిమమ్ రేంజ్ సినిమాలని థియేటర్స్ కి వచ్చి ప్రేక్షకులు చూడటానికి ఆసక్తి చూపించడం లేదు.ఈ కారణంగా శ్రీకారం లాంటి మంచి సినిమా కూడా కలెక్షన్స్ డ్రాప్ అయిపోయి డిజాస్టర్ అయ్యింది.
వకీల్ సాబ్ కలెక్షన్స్ ప్రస్తుతానికి భాగానే ఉన్న అవి ఎన్ని రోజులు నడుస్తాయనేది తెలియని పరిస్థితి.ఇదిలా ఉంటే కరోనా ఎఫెక్ట్ నుంచి బయటపడేందుకు ఇప్పటికే శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ మూవీ రిలీజ్ వాయిదా వేసేశారు.
ఇప్పుడు నాని కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.నాని టక్ జగదీశ్ ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రమోషన్స్ కూడా సాధ్యం కాదని, అలాగే రిలీజ్ చేసిన ఇబ్బందికరమే అని భావించి టక్ జగదీశ్ సినిమా వాయిదా వేసేశారు.ఈ విషయాన్ని నాని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
కరోనా పరిస్థితుల కారణంగా సినిమా వాయిదా వేస్తున్నట్లు తెలిపాడు.త్వరలో నెక్స్ట్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని స్పష్టం చేశాడు.
దీనిని ఒక వీడియో రూపంలో క్రియేటివ్ గా ప్రెజెంట్ చేయడం విశేషం.