ఏమీ లేని విస్తారాకు ఎగిరెగిరి పడుతుందనే సామెత ప్రస్తుత పరిస్థితులలో బీజేపీకి కరెక్ట్ గా సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు ప్రగాఢంగా అభిప్రాయపడుతున్నారు.ఎటువంటి విమర్శలకైనా ఓ హద్దు, అదుపు ఉంటుంది.
సహేతుక విమర్శలను ఎవరైనా స్వాగతిస్తారు.అవే విమర్శలు శృతి మించితే ప్రజలు హర్షించరే విషయాన్ని ఈ రాజకీయ నాయకులు చాలా ఆలస్యంగా గుర్తిస్తారు.
బీజేపీ టీఆర్ఎస్ పై విమర్శలు చేసినట్టు వేరే ఏ పార్టీ కూడా చేయలేదు.టీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పు ఉండొచ్చు కాక, కాని పరుష పదజాలంతో బహిరంగ సభలో మాట్లాడడం భావ్యం కాదనే విషయాన్ని బీజేపీ గుర్తేరాగాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు ఇదే వైఖరి బీజేపీ కొంప ముంచిందనే చెప్పవచ్చు.ప్రజలు బీజేపీ విషయంలో ఎటువంటి నిర్ణయానికి వచ్చారంటే ప్రభుత్వాన్ని తిట్టడమే వీరి పనిలా ఉందని, విమర్శలు అవసరం లేని చోట కూడా విమర్శిస్తూ ప్రజల్లో పలుచబడ్డారని చెప్పవచ్చు.
అందుకే నాగార్జున సాగర్ లో బీజేపీని అసలు పరిగణలోకి తీసుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే బండి సంజయ్ విమర్శలకు ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించడం లేదట.
దీంతో ఇప్పుడు బీజేపీ నేతలు ఆలోచనలో పడ్డారని, ఈ ఎన్నిక వరకు కాక తెలంగాణలో బీజేపీ మనుగడకే ప్రమాదం పొంచి ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారని సమాచారం.