జిడ్డు చ‌ర్మానికి చెక్ పెట్టే క‌ర్పూరం..ఎలా వాడాలంటే?

జిడ్డు చ‌ర్మం.ఎంద‌రినో వేధించే స‌మ‌స్య ఇది.స్నానం చేసిన కొద్ది సేప‌టికే ముఖం జిడ్డుగా మారిపోతుంటుంది.దాంతో ఏ లోష‌న్ రాసుకోవాల‌న్నా, ఏ క్రిమ్ పూసుకోవాల‌న్నా కొంత స‌మ‌యానికి జిగురుగా కారిపోతుంద‌ని భ‌య‌ప‌డ‌తుంటారు.

 Camphor Helps To Reduce Oiliness On Face! Campho, Reduce Oiliness On Face, Oily-TeluguStop.com

ఇక ఫ్రెష్ లుక్ కోసం ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసుకున్నా ఫ‌లిత‌మే ఉండ‌దు.దాంతో తీవ్రంగా కృంగిపోతుంటారు.అయితే జిడ్డు చ‌ర్మానికి చెక్ పెట్ట‌డంలో క‌ర్పూరం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి క‌ర్పూరాన్ని ఎలా వాడాలి అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో ఒక స్పూన్‌ క‌ర్పూరం పొడి మ‌రియు ఒక స్పూన్ తేనె వేసి బాగా క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని కంట్లో వెళ్ల‌కుండా.ముఖానికి అప్లై చేసుకోవాలి.

ప‌ది నిమిషాల పాటు ఆరనిచ్చి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చ‌ర్మంపై అద‌న‌పు జిడ్డు తొల‌గి.ముఖం కాంతి వంతంగా మారుతుంది.

అలాగే ఒక బౌల్‌లో క‌ర్పూరం పొడి మ‌రియు ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు ప‌ట్టించి.ఐదు లేదా ప‌ది నిమిషాల పాటు వ‌దిలేయాలి.అనంత‌రం కూల్ వాట‌ర్‌తో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే జిడ్డు పోయి ముఖం అందంగా, మృదువుగా మారుతుంది.

ఇక క‌ర్పూరం జిడ్డు చ‌ర్మాన్నే కాదు.

మొటిమ‌ల స‌మ‌స్య‌ను కూడా నివారిస్తుంది.క‌ర్పూరం పొడిలో కొబ్బ‌రి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని రాత్రి ప‌డుకునే ముందు మొటిమ‌లు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి.ఉద‌యాన్నే క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే మొటిమ‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.‌‌

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube