ప్రస్తుతం కరోనా వల్ల దేశంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్దితుల్లో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారట.కరోనా ఇంతలా వ్యాప్తి చెందుతున్న గానీ లాక్డౌన్ మాత్రం విధించమని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇక ప్రజల బ్రతుకులు అయితే ఈ సమయంలో మరీ దారుణంగా ఉన్నాయి.ఎందుకంటే కరోనా ఏ వైపు నుండి దాడిచేస్తుందో అర్ధం కానీ స్దితి ప్రస్తుతం నెలకొంది.
ఇదిలా ఉండగా దేశ సర్వోన్నత న్యాయస్థానంపై కరోనా తన పంజా విసిరింది.కొవిడ్ బారిన సుప్రీం కోర్టులో పనిచేస్తున్న వారిలో 50 శాతం సిబ్బందికి పైగా పడినట్లుగా సమాచారం.
ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు వర్గాలు నేటి నుంచి విచారణలన్నీ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని వెల్లడించాయి.అంతే కాకుండా కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలని నిర్ణయించుకున్నారట.
ఇక ఈ విషయంలో స్పందించిన ఒక న్యాయమూర్తి సుప్రీం కోర్టులో నాతో పని చేస్తున్న చాలా మంది సిబ్బంది, క్లర్కులు, లాయర్లు కరోనా బారిన పడ్డారని కాబట్టి నిర్లక్ష్యం ఏమాత్రం తగదని వెల్లడించారు.