‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మహేష్ బాబుకు 27 వ సినిమాగా రాబోతుంది.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను పరుశురామ్ సామజిక అంశాలతో తెరకెక్కిస్తున్నాడు.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం.ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.అయితే మహేష్ ఈ సినిమా తర్వాత రాజమౌళి తో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ సినిమాకు ఇంకా చాలా టైం ఉండడంతో మహేష్ ఈ గ్యాప్ లో మరొక సినిమా చేస్తున్నట్టు టాక్ వస్తుంది.
మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.ఉగాది కానుకగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
అయితే ఇది ఇలా ఉండగా మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడో అని ప్రేక్షకుల్లో ఇప్పటి నుండే ఆసక్తి మొదలైంది.అయితే వీరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కథపై ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
రాజమౌళి మరోసారి పీరియాడిక్ కథనే మహేష్ కోసం ఎంచుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వస్తుంది.ఈయన మహేష్ బాబుతో ఛత్రపతి శివాజీ సినిమా తెరకెక్కించబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది.
కానీ ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.అయితే ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా విడుదల అయితే కానీ రాజమౌళి మహేష్ సినిమాపై ద్రుష్టి పెడతాడు.