గతేడాది దేశంలోకి ప్రవేశించిన కరోనా ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నదని వైద్య అధికారులు హెచ్చరిస్తున్న పట్టించుకోని ప్రజలు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం కేసుల తీవ్రత ఊహంచని స్దాయిలో పెరిగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో గత సంవత్సరం నుండే కరోనా నిబంధనలు అమలులోకి తెచ్చారు.
కానీ వీటిని పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం చూసీ చూడనట్లుగా వ్యవహరించింది.ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు సెకండ్ వేవ్ ముప్పునకు కారణమైందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.
వ్యాక్సిన్ తీసుకున్నా మాస్కు పెట్టుకోవడం, కోవిడ్ నియమాలను తప్పని సరిగ్గా పాటించడం వంటివి నిర్బంధ క్రమశిక్షణగానే అమలుచేయాలని వెల్లడించారట.
ఇక రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి మాస్కులు పెట్టుకోనివారిపై కేసుల నమోదలు మొదలు స్పాట్ ఫైన్ వసూళ్ల వరకు కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉందని ఈ నిర్ణయాల వల్ల తెలుస్తుంది.
ఒకరకంగా ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయమార్గంగా మారుతుందని అనుకుంటున్నారట.
మొత్తానికి ఇకనుండి మొక్కుబడి తనిఖీలకు కాలం చెల్లిస్తూ, ఇక సీరియస్ యాక్షన్ అంటూ అధికారులు రంగంలోకి దిగుతున్నారని అర్ధం అవుతుంది.