వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీయం.. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నగదు బహుమతి.. !

ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.కాగా ఉగాది పండుగను పురస్కరించుకుని వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా వారికి సత్కారం, అవార్డుల ప్రదానోత్సవాలను నేటి నుంచి నిర్వహించనుంది
.

 Good News For Ap Volunteers Ap, Volunteers, Good News, Cash Prize, Rs 10 Thousan-TeluguStop.com

ఇకపోతే ప్రతి జిల్లాలో రోజుకొక నియోజకర్గం చొప్పున ఏప్రిల్‌ 28వ తేదీ వరకు వాలంటీర్లకు సత్కార కార్యక్రమాలు కొనసాగనున్నాయని వెల్లడిస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజక వర్గంలో సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఇందులో భాగంగా వాలంటీర్ల పనితీరు ఆధారంగా సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర వంటి అవార్డులతో 3 కేటగిరీల్లో సత్కరించనున్నారట.

అంతే కాకుండా ఈ సత్కారం పొందుతున్న వాలంటీర్లకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నగదు బహుమతితో పాటు మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జిలను అందజేస్తారట.ఇకపోతే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని మే 4వ తేదీ తర్వాత నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube