వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత ఇటీవల ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.తన తండ్రి హత్య కేసు విషయంలో ఇప్పటివరకు ఏమీ తేల్చలేక పోయారు ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్న మాకే ఈ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే తాజాగా సిబిఐ బృందం దూకుడు పెంచింది.ఇటీవల సిబిఐ అధికారులు మళ్లీ కడపకు రావడం జరిగింది.
ఈ నేపథ్యంలో మరోసారి ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను విచారించడానికి సిబిఐ అధికారులు రెడీ అయ్యారు.ఈ కేసుకు సంబంధించి రాజకీయ కుట్ర ఉందని ఇప్పటికే డాక్టర్ సునీత రెడ్డి ఆరోపణలు చేయడం జరిగింది.
ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పార్టీల రాజకీయ నేతలు ఈ హత్య కేసుకు సంబంధించి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు.ముఖ్యంగా వైసీపీ మరియు టిడిపి పార్టీకి చెందిన నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ఇలాంటి తరుణంలో సీబీఐ రంగంలోకి దిగి మరోసారి ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను విచారించడానికి రెడీ అవ్వడం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
.