ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన అందాల భామ కృతి శెట్టి.ఈ భామ మొదటి సినిమా రిలీజ్ కాకుండానే నేచురల్ స్టార్ నాని, సుదీర్ బాబు సినిమాలలో అవకాశం పట్టేసింది.
ఇక ఉప్పెన రిలీజ్ తర్వాత ఏకంగా ఎనర్జిటిక్ హీరో నానికి జోడీగా మరో సినిమా అవకాశం పట్టేసింది.ఇలా ప్రస్తుతం కృతి శెట్టి తన క్రేజ్ తో తెలుగులో ముగ్గురు యంగ్ క్రేజీ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది.
మరో వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే సినిమా కోసం కృతి శెట్టిని సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇలా వరుస అవకాశాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేస్ లోకి ఈ అమ్మడు దూసుకొచ్చేస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడుపై కోలీవుడ్ దర్శక, నిర్మాతల దృష్టి కూడా పడింది.తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది దర్శక, నిర్మాతలు కృతి శెట్టి డేట్స్ కోసం సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
వీటిలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉండటం విశేషం.
స్టార్ హీరో ధనుష్ తన నెక్స్ట్ సినిమాని బాలాజీ మోహన్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకి సంబంధించి సన్నాహాలు అవుతున్నాయి.ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఈ సినిమా ఉంది.
ఇక ఇందులో హీరోయిన్ కోసం ప్రస్తుతం వేట సాగుతుంది.ముందు నుంచి ఈ సినిమా కోసం ప్రియాంకా ఆరుళ్ మోహన్ పేరు వినిపిస్తూ వచ్చిన కూడా తాజా కృతి శెట్టి పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది.
ఈ భామని ఖరారు చేసే పనిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇది ఒకే అయితే మొదటి సినిమానే స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన భామగా కృతి శెట్టి నిలిచిపోతుంది.