తెలుగు రెండు రాష్ట్రాలలో కరోనా తీవ్రత మరింత పెరుగుతుంది.తెలంగాణాని మించేలా ఏపీలో రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో తెలంగాణాలో 3184 కేసులు రాగా ఏపీలో మాత్రం 3495 కేసులు నిర్ధారణ అయ్యాయి.ఒక్కరోజులో ఏపీలో అత్యధిక కేసులు నమోదు కావడంతో అందరు షాక్ అవుతున్నారు.
ఏపీలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తుంది.ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నా సరే కేసులు అధికమవడంపై ప్రజల్లో ఆందోళనలు మొదలవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ సీరియస్ యాక్షన్ లోకి దిగుతుంది.ఆరోగ్య శాఖా ఇప్పటికే మరోసారి ఆంక్షలతో కూడిన జన సమూహాలను సూచిస్తున్నారు.ఏపీలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండటం వల్ల కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి.వ్యాక్సిన్ ప్రక్రియ మరింత వేగవంతం చేసి కరోనాపై పోరాడేలా ప్రజలను ఏర్పాటు చేయాలని దానితోడుగా వ్యక్తిగత భధ్రత కూడా ప్రజల్లో ఉండాలని మాస్క్, శానిటైజేషన్ వాడాలని చెబుతున్నారు.
తెలంగాణాలో కన్నా ఏపీలో కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వస్తుంది. ఏపీ సిఎం జగన్ కూడా ఆరోగ్య శాఖా అధికారులతో చర్చలు జరిపి కరోనా నియంత్రణ చర్యలను చేపట్టాలని చూస్తున్నారు.
పరిస్థితి ఇలానే ఉంటే కొన్ని ఆంక్షలను కూడా విధిస్తారని తెలుస్తుంది.