క్రికెట్ అంటే యువకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను.ఇందులో ఉన్న వారికి డబ్బుకు డబ్బు, పేరుకు పేరు.
కానీ ఈ ఆటలో క్రమశిక్షణ తప్పితే మాత్రం జరిమానాలు దిమ్మతిరిగేలా ఉంటాయి.ఇలాంటి పని వల్లే ఎంఎస్ ధోనీకి రూ.12 లక్షల జరిమానా చెల్లించవలసి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.
నిన్న శనివారం ముంబైలోని వాఖండే స్టేడియం వేదికగా ఐపీఎల్లో, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మధ్య 14వ సీజన్లో రెండో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.కాగా ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్క్కేపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.కానీ ఈ మ్యాచ్లో చెన్నై టీం స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ఎంఎస్ ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించారట.ఇకపోతే ఈ సీజన్లో ధోనీ చేసిన తొలి తప్పుగా దీనిని పరిగణించిన బోర్డ్ ఆయనపై కేవలం జరిమానా వేసి వదిలేశారట.