దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే కరోనా వల్ల కోలుకోలేని విధంగా ఉన్న సంగతి తెలిసిందే.దీనికి తోడు వాతావరణ కాలుష్యం కోరల్లో చిక్కుకుని అల్లాడుతుంది.
ఇది చాలదన్నట్లుగా అగ్నిప్రమాదాలు అతిధుల్లా పలకరిస్తున్నాయి.కాగా ఇదేక్రమంలో ఢిల్లీలోని శాస్త్రిపార్క్ ఫర్నిచర్ మార్కెట్లో శనివారం అర్ధరాతి ఘోర అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇక మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 250 ఫర్నిచర్, హార్డ్వేర్ దుకాణాలకు మంటలు వ్యాపించగా, ఈ ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లుగా సమాచారం.
అయితే మంటల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని కూడా రక్షించారట.
ఇక ప్రమాదంలో సుమారు 250 ఫర్నిచర్, హార్డ్వేర్ దుకాణాలకు మంటలు వ్యాపించగా.అందులోని సామగ్రి అగ్నికి ఆహుతైందని అధికారులు వెల్లడించారు.
అయితే ఈ ప్రమదానికి గల కారణాలు ఇంకా నిర్దారించలేదని తెలిపారు.