ఏపీ కరోనా అప్‌డేట్.. సెకండ్ వేవ్ తీవ్రత చాలా ఉందట.. ?

గత సంవత్సరం క్రితం దేశంలో అడుగు పెట్టిన కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తుంది.ప్రస్తుత పరిస్దితుల్లో కరోనా తీవ్ర రూపందాల్చుతున్నట్లే కనిపిస్తుంది.

 Ap Covid Cases Updates, Ap, Corona Update, Three Thousand, New Cases, Covid 19,-TeluguStop.com

ఈ క్రమంలో ఏపీలో కూడా భారీ సంఖ్యలో కరోనా కేసులు బయట పడుతున్న విషయం తెలిసిందే.

కాగా ఏపీలో గడచిన 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసుల వివరాలను అక్కడి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వీరి లెక్కల ప్రకారం.ఏపీలో 31,929 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,309 మందికి కరోనా నిర్ధారణ అయిందని అధికారులు తెలియ చేస్తున్నారు.

ఇకపోతే చిత్తూరు జిల్లాలో భారీ స్థాయిలో 740 పాజిటివ్ కేసులు నమోదవగా, కర్నూలు జిల్లాలో 296 కేసులు, గుంటూరు జిల్లాలో 527, విశాఖ జిల్లాలో 391 కోవిడ్ కేసులు బయటపడ్దాయట.ఇక విజయనగరంలో 97, పశ్చిమ గోదావరిలో 26 కొత్త కేసులు నమోదయ్యాయట.

ఇదిలా ఉండగా ఒక్క చిత్తూరు జిల్లాలోనే కరోనా వల్ల ముగ్గురు మరణించారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube