అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా డైరక్షన్ లో వస్తున్న సినిమా మేజర్.26/11 ముంబై టెర్రరిస్ట్ ఎటాక్ లో హీరోగా నిలిచిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథతో ఈ సినిమా వస్తుంది.సినిమాలో హీరోయిన్ గా శోభిత దూళిపాల నటిస్తుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ అప్డేట్ వచ్చింది.ఉగాది కానుకగా ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 12 సాయంత్రం 4:05 నిమిషాలకు మేజర్ టీజర్ రిలీజ్ చేస్తున్నారు.
రీసెంట్ గా ఫస్ట్ లుక్ గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు.
ఇక రాబోతున్న టీజర్ తో సినిమాపై మరింత క్రేజ్ తీసుకురావాలని చూస్తున్నారు.అడివి శేష్ మేజర్ టీజర్ పై స్పెషల్ అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
టాలీవుడ్ లో ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్న అడివి శేష్ తన మార్క్ చూపించడానికి మరోసారి మేజర్ గా వస్తున్నాడు.క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో సత్తా చాటిన అడివి శేష్ ఈ సినిమాతో కూడా తన టాలెంట్ చూపించ్డానికి సిద్ధమయ్యాడు.
మేజర్ తో పాటు అడివి శేష్ గూఢచారి 2 కూడా సెట్స్ మీద ఉంది.మేజర్ సినిమాకు మహేష్ నిర్మాతగా ఉండటం సినిమాపై స్పెషల్ క్రేజ్ తెచ్చిపెట్టింది.
మహేష్ చేతుల మీదుగానే ఈ టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.