సైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే పుష్ప నుండి విడుదలైన ఇంట్రడక్షన్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారనే చెప్పవచ్చు.
ఇప్పటికే ఈ టీజర్ 17 మిలియన్ల వ్యూస్ అందుకుని ట్రెండింగ్ లో ఉంది.అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజును మరింత స్పెషల్ చేయడానికి మేకర్స్ మరొక పోస్టర్ విడుదల చేసారు.
ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.అంతేకాదు ఇందులో అల్లు అర్జున్ బైక్ మీద కూర్చుని, బ్లాక్ కళ్ళ అద్దాలు పెట్టుకుని, వైట్ షర్ట్ వేసుకుని టక్ చేసుకుని చేయి పైకి ఎత్తి చూస్తున్నట్టు కనిపిస్తున్నాడు.
ఈ పోస్టర్ కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది.ఇది ఇలా ఉండగా ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ పుష్ప సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.అల్లు అర్జున్ మొదటి సారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.రష్మిక మందన్న ఒక గిరిజన యువతిగా నటిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడని ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ మధ్య సీన్స్ చిత్రీకరిస్తున్నారు.ఈ సినిమాను స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 13 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.