1.సీరియస్ కరోనా పేషంట్స్ కే బెడ్స్
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో ఆరోగ్య పరిస్థితి శ్రీ చైతన్య హాస్పిటల్ లో వెడ్స్ కేటాయించాలని నిర్ణయించింది .సాధారణ లక్షణాలతో మాత్రమే కరోనా వ్యాపిస్తే వారికి బ్రెడ్స్ కేటాయించాల్సిన అవసరం లేదని తేల్చింది.
2.కరోనా నియంత్రణ టెస్ట్ లపై హైకోర్టులో విచారణ
తెలంగాణలో కరుణ నియంత్రణ పరీక్షలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.కరోనా టెస్టులు, వ్యాక్సిన్ పై ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించింది.
3.చార్మినార్ వద్ద ఘర్షణ
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ చార్మినార్ వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
చార్మినార్ వద్ద వీధి వ్యాపారుల ఒకరిపై ఒకరు దాడికి దిగారు.ఈ ఘటనలో ఓ వ్యాపారి తీవ్రంగా గాయపడ్డారు.
4.తమిళనాడులో పశ్చిమ పోలీసులకు కరోనా
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తమిళనాడు ఎన్నికల విధులకు వెళ్లిన పోలీసుల్లో పది మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
5.పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ వినోద్
తనకు తగిన న్యాయం చేయాలని కోరుతూ, జబర్దస్త్ వినోద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి కి ఫిర్యాదు.ఇల్లు కొనుగోలు లావాదేవీల వ్యవహారంలో ఈ ఫిర్యాదు చేశాడు.
6.వైన్ షాపులు , సినిమా థియేటర్ల పై ఆంక్షలు
తెలంగాణలో వైన్ షాపులు , సినిమా థియేటర్ల పై ఆంక్షలు విధించారు.తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
7.ఏపీకి కోటి కరోనా వాక్సిన్ లుు
ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కోటి వ్యాక్సిన్ లను కేంద్రం అందించనుంది.
8.అశ్వర్ధామ రెడ్డి రాజీనామా
తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక కార్యదర్శి , ఆర్టీసీ జేఏసీ చైర్మన్ పదవికి అశ్వర్ధమ రెడ్డి మరికాసేపట్లో రాజీనామా చేశారు.
9.కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్న మల్లారెడ్డి
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మంత్రి మల్లారెడ్డి బెదిరించిన వ్యవహారంలో ఆడియో లీక్ కావడంతో, దీనిపై వివరణ ఇచ్చేందుకు మంత్రి మల్లారెడ్డిని కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా, ఆయనకు అపాయింట్మెంట్ దొరకడం లేదట.
10.నటి లక్ష్మి రాయ్ నిశ్చితార్థం
బాలీవుడ్, టాలీవుడ్ , లో పలు చిత్రాల్లో నటించిన కన్నడ సినీ నటి లక్ష్మి రాయ్ నిశ్చితార్థం ఈ నెల 27 న జరగనుంది.
11.కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణలోని పెద్ద ఊర మేజర్ పంచాయతీ సర్పంచ్ కర్నాటి విజయ భాస్కర రెడ్డి అకాల మరణం తట్టుకోలేక మంత్రి జగదీష్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.
12.వాక్సిన్ వేసుకున్న వారానికే నగ్మాకు కరోనా
కరోనా వాక్సిన్ వేయించుకున్న వారానికే సినీ నటి నగ్మాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
13.శరత్ కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు
చెక్ బౌన్స్ కేసులో హీరో శరత్ కుమార్ , రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది.
14.తిరుమలలో చంద్రబాబు కి ఘన స్వాగతం
ఎన్నికల ప్రచారం సందర్భంగా తిరుమలకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
15.తెలంగాణలో కరోనా
గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2055 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.లక్ష మందితో కేసీఆర్ సభ
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల లో టీఆర్ఎస్ అభ్యర్ధి విజయానికి దోహదం చేసేలా లక్ష మందితో ఈ నెల 14 న కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
17.మధ్యప్రదేశ్ లో వారాంతపు లాక్ డౌన్
మధ్యప్రదేశ్ లో వారాంతపు లాక్ డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
18.సెకండ్ వేవ్ లో కొత్త లక్షణాలు
కరోనా సెకండ్ వేవ్ లో కరోనా కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి.ఆకలి మందగించడం, కీళ్ల నొప్పులు, జీర్ణాశయ సమస్యలు, బయటపడుతుండడం తో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు.
19.మావోల చెర నుంచి రాజేశ్వర్ సింగ్ విడుదల
మావోల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాజేశ్వర్ సింగ్ కు విముక్తి లభించింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,550
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,550.