మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది ట్విట్టర్ లో అల్లు అర్జున్ అఖిల్ మరియు అకీరాల బర్త్ డే ల సందర్బంగా మూడు ట్వీట్స్ ను చేసిన విషయం తెల్సిందే.ముగ్గురితో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పడంతో పాటు వారికి ఆశీర్వాదం ఇచ్చాడు.
ట్విట్టర్ లో ఎంటర్ అయిన మొదట్లో చిరంజీవి ఆ ట్వీట్స్ ను చేయడం జరిగింది.ఇక నేడు ఆ ముగ్గురి పుట్టిన రోజు సందర్బంగా మళ్లీ చిరంజీవి ట్వీట్స్ చేస్తాడని అంతా ఊహించారు.
చిరంజీవి నేడు కూడా ట్వీట్స్ అయితే చేశాడు కాని ముగ్గురి గురించి చేయలేదు.కేవలం ఇద్దరి గురించి మాత్రమే ట్విట్టర్ లో ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశాడు.
ఈసారి పవన్ తనయుడు అకీరాను చిరంజీవి పక్కకు పెట్టాడు. చిరంజీవి ఎంతో ఇష్టపడే అకీరాను ఎందుకు పక్కన పెట్టాడు అనేది మెగా ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది.
సోషల్ మీడియాలో అకీరా పుట్టిన రోజు సందర్బంగా పెద్ద ఎత్తున ట్రెండ్ అయితే సాగుతోంది.ట్రెండ్ లో చిరంజీవి ట్వీట్ కూడా చేసి ఉంటే మరింత జోరుగా పవన్ అభిమానుల ట్విట్టర్ లో సందడి చేసే వారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం అకీరా సినిమా ఎంట్రీపై వస్తున్న వార్తల నేపథ్యంలో అంచనాలు భారీగా ట్వీట్స్ పడుతున్నాయి.అయితే ఇప్పటి వరకు ఆ విషయమై అకీరా నుండి కాని రేణు నుండి కాని క్లారిటీ రాలేదు.
నేడు పవన్ తనయుడికి సంబంధించిన ట్వీట్స్ తో ట్విట్టర్ల ఓ మోత మ్రోగిస్తున్నారు.కాని చిరంజీవి నుండి ట్వీట్ రాకపోవడం నిరాశను కలిగించిందని అభిమానులు అంటున్నారు.అల్లు అర్జున్ మరియు అఖిల్ లకు తనదైన శైలిలో చిరంజీవి శుభాకాంక్ష లు తెలియజేశాడు.చిరంజీవి ఈ ఏడాది తప్పకుండా అఖిల్ కు సక్సెస్ వస్తుందని ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది.