సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు వరుస ఆఫర్లను సొంతం చేసుకోవడం అంత తేలిక కాదు.అయితే తెలుగులో 1 నేనొక్కడినే, దోచెయ్ సినిమాలలో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోలేకపోయిన కృతిసనన్ ప్రస్తుతం ఏడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారని సమాచారం.
మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కృతి సనన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం కృతి సనన్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు బచ్చన్ పాండే, భేడియా సినిమాల్లో కూడా కృతిసనన్ నటిస్తున్నారు.ఈ సినిమాలతో పాటు కృతిసనన్ చేతిలో మిమీ, గణ్ పత్ హమ్ దో హమారే దో, మరో సినిమా ఉన్నాయి.
మొత్తంగా ఏడు సినిమాలతో బాలీవుడ్ లో మరే హీరోయిన్ లేనంత బిజీగా కృతిసనన్ ఉండటం గమనార్హం.
ప్రస్తుతం కృతిసనన్ నటిస్తున్న సినిమాలు హిట్టైతే మాత్రం ఆమె మరిన్ని ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.ఏక కాలంలో 7 సినిమాల్లో నటిస్తూ ఉండటంతో కృతికి కరోనా సోకితే ఆ సినిమాల షూటింగ్ లు వాయిదా పడే అవకాశం ఉంది.ఏడు సినిమాల షెడ్యూల్స్ పై తన వల్ల ఎఫెక్ట్ పడకూడదని కృతి భావిస్తున్నారని సమాచారం.
వరుస ఆఫర్లతో బిజీగా ఉండటంతో కృతి సంతోషంగా ఉన్నారు.
ఆదిపురుష్ సినిమా హిట్టైతే తెలుగులో కృతిసనన్ కు ఆఫర్లు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.
కృతిసనన్ ఒకేసారి ఇన్ని సినిమాల్లో నటించడం ఇదే తొలిసారి.ఆదిపురుష్ సినిమా హిట్టైతే కృతిసనన్ తెలుగులో కూడా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం తెలుగుతో పోలిస్తే హిందీ సినిమాల్లోనే కృతిసనన్ ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం.ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.