బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు కాన్వాయ్ పై దాడి..!!

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు మాత్రమే కాకుండా దాడులు ప్రతి దాడులు కూడా జరుగుతున్నాయి.ఏకంగా కేంద్ర మంత్రులను మరియు పార్టీ అధ్యక్షులని  టార్గెట్ చేస్తూ పశ్చిమ బెంగాల్ లో దాడులు జరగటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

 Bengal Bjp President's Convoy Attacked Mamatha Banerjee, Tmc,bjp, Dilip Gosh-TeluguStop.com

తాజాగా బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్ పై దాడి జరిగింది.

కూచ్ బీహార్ జిల్లాలో ఈ దాడి జరిగినట్లు బిజెపి నేతలు పేర్కొన్నారు.

అధ్యక్షుడు కారుపై కొంతమంది దుండగులు రాళ్లు విసిరినట్లు బెంగాల్ బీజేపీ నేతలు పేర్కొన్నారు.ఇదిలా ఉంటే దాడికి సంబంధించిన వీడియోను బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తన సోషల్ మీడియా లో విడుదల చేశారు.

ఏప్రిల్ పదో తారీఖున బెంగాల్ రాష్ట్రంలో నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు భారీగా పేలుతున్నాయి.ముఖ్యంగా బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున తరహాలో రాజకీయ వేడి నెలకొంది.ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యవహరిస్తోంది.

సో తమ పార్టీ అధ్యక్షుడిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండగులే దాడి చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube