దేశంలో వైరస్ ఎక్కువ విజృంభిస్తున్న నగరాలను కట్టడి చేయడం కోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగానే దేశంలో సగానికి పైగా కేసులు నమోదవుతున్నాయి మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ వీకెండ్ లలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
ఢిల్లీలో కూడా ఏప్రిల్ ఆరో తారీకు నుండి ఏప్రిల్ 30 వ తారీకు వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇదే తరహాలో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ జాబితాలోకి తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేరింది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని విధంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవుతూ.
కరోనా వైరస్ కేసులు ఎక్కువగా బయట పడుతున్న లక్నో, వారణాసి, కాన్పూర్ వంటి చోట ఈ రోజు నుండి ఈ నెలాఖరు వరకు రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.అంతే కాకుండా అన్ని స్కూల్స్ మరియు కాలేజీలు కూడా ఈ మూడు జిల్లాల్లో మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
.