దేశంలో కరోనా మెదటి డోస్ వ్యాక్సినేషన్ పక్రియ విజయవంతంగా ముగిసింది.ప్రస్తుతం అందరు సెకండ్ డోస్ టీకాను ఇప్పించుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రముఖులంతా కూడా కోవిడ్ సెకండ్ డోస్ టీకాను తీసుకోవడానికి ముందుకొస్తున్నారు.
న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు.
ఇకపోతే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండో విడుత ప్రారంభమైన మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు.ఆ తర్వాత తిరిగి 37 రోజుల తర్వాత రెండో డోసు వేయించుకున్నారు మోదీ.
ఈ క్రమంలో ప్రధాని మాట్లాడుతు.నేను ఎయిమ్స్లో ఈ రోజు కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నాను.
ఎందుకంటే కరోనా వైరస్ ను జయించడానికి ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషన్ ఒకటని కాబట్టి అర్హులైన వారందరు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని వెల్లడించారు.
ఇకపోతే ప్రస్తుతం హైదరాబాదీ కంపెనీ భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ టీకాను ఇక్కడ ఊపయోగిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ వ్యాక్సిన్ కావాలనుకునే వారు CoWin.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలసి ఉంటుంది.