నగరంలోని పాతబస్తీలో గొడవలు అంటే కొన్ని సంవత్సరాల క్రితం జరిగినవే అని చెప్పవచ్చూ.ఈ ప్రాంతంలో జరిగే గొడవలు నగరాన్ని భయంలో ముంచేవి.
అసలు మొదట గొడవ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుండే.కానీ గత కొంత కాలంగా నగరం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది.
ముఖ్యంగా పాతబస్తీ.
ఇక ఇన్నాళ్లకూ ఈ రోజు అంటే గురువారం తెల్లవారుజామున చార్మినార్ వద్ద వీధుల్లో వస్తువులను విక్రయించే చిరు వ్యాపారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందట.
ఈ గొడవ పెద్దగా మారి ఒకరినొకరు పరస్పరం తల్వార్లతో దాడులు చేసుకునే వరకు వెళ్లిందట.
ఇక ఈ దాడిలో పలువురికి తీవ్రగాయాలవగా చొరవతీసుకున్న స్థానికులు భయాన్ని పక్కనపెట్టి గాయపడిన వారిని దగ్గర్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లుగా సమాచారం.
కాగా ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారట.ఈ గొడవ జరగడానికి మూల కారణం ఏంటో తెలియాల్సి ఉంది.