రకుల్ ప్రీత్ సింగ్ కెరటం సినిమాతో తెలుగు తెరపై పరిచయమైన ఈ భామ తన అంద చందాలతో కుర్ర కారును మత్తెక్కించిన ఈ భామ పరిశ్రమకు వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.తొలుత కొన్ని సినిమాలు అంటే వెంకటాద్రి సినిమాతో హిట్ కొట్టిన రకుల్ ప్రీత్ సింగ్ నాన్నకు ప్రేమతో, లౌక్యం, ధృవ, సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి టాలీవుడ్ లో లీడ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.
ఆ తరువాత బాలీవుడ్ పైన దృష్టి ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన రకుల్ నటిస్తోంది.ప్రస్తుతానికి తెలుగులో అంతగా సినిమాలకు ఒకే చెప్పకుండా, కేవలం బాలీవుడ్ పైనే దృష్టి పెడుతోంది రకుల్ ప్రీత్ సింగ్.
అయితే నెట్టింట్లో రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది.ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ సందేశంతో చెట్టు ఎక్కిన ఫోటోలను తన వ్యక్తిగత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆరోగ్యం అంటే జిమ్ లో వర్కవుట్స్ చేయడం, సన్నబడటం లోనే ఉండదని, చెట్లు ఎక్కుతుండటం, ప్రకృతి ఒడిలో ఎక్కువ సేపు గడిపేలా లైఫ్ ను ప్లాన్ చేసుకోవడం లాంటి పనులు చేయాలని రకుల్ తెలిపింది.అయితే మీలో చిన్నపిల్లాడిని బయట పెట్టండి బయటకు తీసుక రావాలని రకుల్ తెలిపింది.