తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ఇప్పటికే బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ఇప్పటికే టీఆర్ఎస్ ను దెబ్బ తీయాలనే లక్ష్యంతో రేవంత్ లాంటి నేతలు కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నారు.అయితే ఇది వరకే ఉన్న పార్టీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతున్న పరిస్థితులలో వైఎస్ షర్మిల కూడా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక అప్పటి నుండి తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.ఇక షర్మిల పార్టీపై టీఆర్ఎస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేయడం, తిరిగి షర్మిల వర్గం నేతలు తిరిగి ప్రతి విమర్శలు చేయడం జరిగింది.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి షర్మిల పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని, షర్మిల తెలంగాణ వ్యతిరేక వ్యక్తి అని వారన్నారు.అయితే ఏప్రిల్ 9 న షర్మిల పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది.
అయితే షర్మిల సభకు ముఖ్య అతిథిగా వైఎస్ విజయ లక్ష్మి పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్లు సమాచారం.ఇప్పటికే పార్టీ అభిమానులు జిల్లాల నుండి జనసమీకరణ చేస్తూ భారీ జనంతో బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
అయితే ఇప్పటి వరకు షర్మిల పార్టీలో ఎవరైనా ఇతర పార్టీల కీలక నేతలు చేరుతున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.