తెలంగాణలో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.కేసీఆర్ కు తాకిన రెండు దెబ్బలు కేసీఆర్ ను సమూలంగా మార్చేసాయట.
అప్పటి వరకు ఏ ఎన్నికలో గెలిచినా ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పగించడం, తన పనిలో తాను నిమగ్నమవడం చేసేవాడు.విజయం సాధించాక ప్రెస్ మీట్ నిర్వహిచడం ఆనవాయితీ.
అయితే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ కు కోలుకోని దెబ్బ తగిలింది.ఇది గమనించిన కేసీఆర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఓటింగ్ సరళిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించాడు.
అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అరకొరగానైనా విజయం సాధించింది.అయితే కేసీఆర్ ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పై దృష్టి పెట్టాడు.అక్కడ బలంగా ఉన్న నేత కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి.అయితే జానారెడ్డిపై కేసీఆర్ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు.
జానారెడ్డి డమ్మీ అభ్యర్థిగా ప్రజల్లోకి బలంగా కేసీఆర్ తీసుకెళ్ళనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ వ్యూహంలో భాగంగానే టీఆర్ఎస్ నేతలు బలంగా ప్రచారం చేస్తున్నారు.
అయితే జానారెడ్డి ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, జానారెడ్డి డమ్మీ అభ్యర్థి అని తాను నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్ విమర్శలు గుప్పించనున్నారు.