ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను చంపేందుకు కడప జిల్లాకు చెందిన తన పాత పరిచయస్తులతో సంప్రదింపులు జరుపుతున్నాడు అంటూ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేశారు.ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఈ విషయమై లేఖ రాయడం జరిగింది.
కడప జిల్లాకు చెందిన ప్రొఫెషనల్ కిల్లర్స్ తో నన్ను హత్య చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.తనకు హైదరాబాద్ మరియు ఏపీకి వెళ్లిన సమయంలో వై కేటగిరి భద్రత కల్పిస్తున్నారు.
తన ఆందోళన నేపథ్యంలో ఢిలీల్లో ఉన్న సమయంలో కూడా భద్రత కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు.
వైకాపా తరపున పోటీ చేసి గెలిచిన రఘు రామ కృష్ణం రాజు ఇప్పుడు ఆ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా మారిపోయాడు.
ఆయన అధినేత వైఎస్ జగన్ రెడ్డి కి వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది.ఇక వైఎస్ జగన్ పరిపాలనలో జరుగుతున్న అక్రమాల గురించి పార్లమెంట్ లో ప్రస్థావిస్తానంటూ రఘురామ కృష్ణంరాజు బాహాటంగానే ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో వైకాపా నుండి కొందరు తనను బౌతిక దాడులకు పాల్పడుతామంటూ హెచ్చరిస్తూ బెదిరిస్తున్నారంటూ మోడీ కి రాసిన లేఖలో రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నాడు.వైకాపా నాయకులను మరియు సీఎం జగన్ ను ఇంకా ఇంకా రఘు రామ కృష్ణం రాజు బెదిరిస్తూనే ఉన్నాడు.