వైరల్ : ఆ గ్రామ ప్రజలు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.. ఎలాగంటే...?

ఒక్కోసారి మన అదృష్టం మనమే నమ్మలేని పరిస్థితి కలుగుతుంది.అలాంటి అదృష్టం ఇటీవల ఒక గ్రామంలో ఉన్న ప్రతిఒక్కరికీ జరిగింది.

 Viral: The People Of That Village Became Millionaires Night After Night .. Someh-TeluguStop.com

అది ఒకరికో, ఇద్దరికో కాదు ఆ గ్రామంలో ఉండే జనాభాకు అంతా ఆ అదృష్టం వరించింది.రాత్రికి రాత్రే ఆ ఊర్లో ఉన్న కుటుంబాల వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారు.

ఇందుకు సంబంధించి అసలు విషయము ఏమిటంటే.

దేశానికి వెన్నుముక రైతులే అని అంటుంటారు.

దేశములో సగానికి మందిపైగా వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు.వీళ్ళ జీవనాధారము అంతా వ్యవసాయమే.

ఈ గ్రామాలకు సరైన రోడ్డు ,బస్సు సౌకర్యాలు సరిగా ఉండవు.కానీ ఇప్పటికీ కొన్ని గ్రామాలు కనీస సౌకర్యాలు లేక ప్రజలు పేదరికంలోనే మగ్గుతున్నారు.

అలాంటి గ్రామ ప్రజలు ఒక్కసారిగా ధనవంతులు అయిపోయారు.అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లాలో బొమ్జా అనే ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఒక్కరోజులోనే ధనవంతులు అయిపోయారు.

ఆ ఊరి ప్రజలను వరించిన అదృష్టం ఏమిటంటే ఆ గ్రామంలో మొత్తం 31 కుటుంబాలు నివసిస్తున్నాయి.

వీరందరికీ కలిసి 200 ఎకరాల భూమి ఉన్నది.

ఈ రెండు వందల ఎకరాల భూమిని కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం కోసము తీసుకున్నదని అధికారులు వెల్లడించారు.దీనికి పరిహారంగా రూ.41 కోట్లు ఇచ్చింది.ఈ భూమిని తీసుకున్నందుకు ఆ గ్రామంలోని కుటుంబాలకు పరిహారంగా అధికారిక లెక్కల ప్రకారము ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 6.73 కోట్లు చెల్లించినది.అలా పరిహారాన్ని అందుకున్న కుటుంబాలు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యరు.

కానీ గవర్నమెంటు అంత పరిహారము ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం.ఏమైతేనేమి ఆ వూరిలో కుటుంబాలు ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు అయ్యారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

భూములలో ప్రాజెక్టు నిర్మించడం వల్ల కొన్ని వేల ఎకరాలకు నీటి వసతి కల్పించబడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube