'ఆర్‌ఆర్‌ఆర్‌' ఆలస్యం కారణంగా ఎన్టీఆర్‌ బుల్లి తెర రీ ఎంట్రీ ఎఫెక్ట్‌

జెమిని టీవీలో ప్రసారం కాబోతున్న ఎన్టీఆర్‌ ‘ఎవరు మీలో కోటీశ్వరులు‘ కార్యక్రమం ను ముందుగా అనుకున్న ప్రకారం అయితే మే లో ప్రారంభించాల్సి ఉంది.అంటే వచ్చే నెలలో ఎన్టీఆర్ మొదటి సీజన్ ను మొదలు పెట్టాలి.

 Ntr Gemini Tv Show Evaru Meelo Kotishwarulu Show May Be Late , #emk, Evaru Meelo-TeluguStop.com

కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంను నెల రోజులు ఆలస్యంగా మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.అందుకే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌ ల పక్రియను పూర్తి చేయలేదు అంటున్నారు.

జూన్‌ నుండి ఈ షో ను జెమిని టీవీ వారు ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఆలస్యంకు ప్రధాన కారణం ఎన్టీఆర్‌ ఇంకా ఆర్‌ ఆర్‌ ఆర్‌ షూటింగ్‌ ను పూర్తి చేయక పోవడమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ మొదటి లేదా రెండవ వారంలోనే ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వాల్సి ఉంది.కాని ఇప్పటి వరకు షూటింగ్‌ షూటింగ్‌ పూర్తి కాలేదు.

మే నెలలో కూడా షూటింగ్‌ చేయాల్సి రావచ్చు అంటూ ఎన్టీఆర్‌ తో ఇటీవలే రాజమౌళి అన్నాడట.దాంతో మే నెలను కూడా జక్కన్న కోసం కేటాయించడం కోసం ఎన్టీఆర్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడట.

ఈ కారణంగానే జూన్‌ వరకు త్రివిక్రమ్‌ కూడా వెయిట్‌ చేయాల్సి వస్తుంది.ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ ల కాంబోలో మూవీ ప్రకటన వచ్చి ఏడాది దాటింది.

కాని ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ ప్రారంభం కాలేదు.కారణం ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే విషయం తెల్సిందే.

ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు కూడా ఆలస్యం అవుతూనే ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.బిగ్‌ బాస్‌ తో అలరించిన ఎన్టీఆర్‌ ఖచ్చితంగా ఈ షో తో కూడా ఆకట్టుకుంటాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube