తెలంగాణ సర్కార్ రానున్న కాలంలో ఓట్లను రాబట్టుకోవడం కోసం ఇస్తున్న హమీల గురించి అందరికి తెలిసిందే.ఈ క్రమంలో నిరుద్యోగుల నుండి ప్రభుత్వ ఉద్యోగుల వరకు హామీల మీద హామీలు గుప్పిస్తుంది.
ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఆర్టీసి కార్ముకుల రిటైర్మెంట్ విషయంలో వయస్సు పెంచిన వారీలో తృప్తి లేదట.
అందుకే ఆర్టీసి కార్మికులు ఈ పెంపు మాకొద్దు మహాప్రభో అంటూ మొరపెట్టుకుంటున్నారట.ఆనందపడక ఎందుకు బాధపడుతున్నారని ఆలోచిస్తున్నారా.
అయితే వినండి.
మామూలుగా ఆర్టీసి ఉద్యోగులకు సమయానికి సరైన నిద్ర, ఆహారం ఉండదు.
విధి నిర్వహణలో వారు ఎప్పుడు ప్రయాణిస్తూ ఉంటారు.దీంతో వారిలో చాలా మందికి బీపీ, షుగర్, వంటి ఇతర వ్యాధులు చుట్టేస్తున్నాయి.
దీంతో ప్రతి సంవత్సరం రిటైర్ అయ్యేలోపే 200 మంది దాకా చనిపోతున్నారట.అదీగాక ఎక్కువ మంది గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తుంది.
అందువల్ల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై వ్యతిరేకత మొదలైందట.