చిరంజీవితో ప్రస్తుతం ‘ఆచార్య‘ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు కొరటాల శివ తన తదుపరి సినిమా ను అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే ఆ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ లో అల్లు అర్జున్ మరియు కొరటాల శివ మూవీ పట్టాలెక్కబోతుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.
ఇక కొరటాల శివ దర్శకత్వంలో మరో మూవీ కూడా రూపొందబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మొన్నటి వరకు చరణ్ తో కొరటాల శివ ఒక సినిమా ఉండే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తో మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ ఒక సినిమా ను చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
వారం రోజుల క్రితం దర్శకుడు కొరటాల ప్రత్యేకంగా ఎన్టీఆర్ ను కలిశాడట.
ఆ సమయంలో ఇద్దరి మద్య ఒక కథ చర్చకు వచ్చింది.ఆ కథలో తాను నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ఎన్టీఆర్ ప్రకటించాడని అంటున్నారు.
ఎన్టీఆర్ ఓకే చెప్పడంతో వచ్చే ఏడాది ఆరంభం లో లేదా సమ్మర్ లో సినిమాను పట్టాలెక్కించే విషయమై నిర్మాతలతో కొరటాల శివ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.కొరటాల శివ ఏడాదికి కనీసం రెండు సినిమాలను అయినా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాలను చేస్తూ దూసుకు పోతున్నాడు.
ఆచార్య అయిన వెంటనే బన్నీతో మూవీ ఆ వెంటనే ఎన్టీఆర్ తో మూవీని పట్టాలెక్కించబోతున్నాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2023లో ఎన్టీఆర్ మరియు కొరటాల శివల కాంబలో మరో జనతా గ్యారేజ్ చిత్రం రావడం ఖాయం అంటున్నారు.
ఎన్టీఆర్ కు జనతా గ్యారేజ్ వంటి హిట్ సినిమాను ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ మరో సారి ఖచ్చితంగా సూపర్ హిట్ ఇస్తాడనే నమ్మకంను నందమూరి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.