ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.కాగా రిటైర్డ్ అర్చకుల విషయంలో టీటీడీ తీసుకున్న సంచలన నిర్ణయం తో ప్రధానా అర్చకుడి హోదాలో మళ్లీ రమణ దీక్షితులు విధులలో చేరారు.
అంతే కాకుండా రమణ దీక్షితులు తో పాటుగా ఆలయంలో మరి కొంతమంది అర్చకులకు అవకాశం కలగనుంది.
ఈ నేపధ్యంలో నలుగురు ప్రధాన అర్చకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపోతే వంశపారం పర్య అర్చకులలోని నాలుగు కుటుంబాలకే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.వారిలో గొల్లపల్లి కుటుంబం నుంచి గోపినాథ్ దీక్షితులను, తిరుపతమ్మ నుంచి నారాయణ దీక్షితులను, పైడపల్లి నుంచి రాజేశ్ దీక్షితులను, అలాగే, పెద్దింటి నుంచి రవిచంద్ర దీక్షితులను నియమిస్తున్నట్లు పేర్కొంది.
కాగా కైంకర్యపర అర్చకులకు ఈ అవకాశం లేదని వివరించింది.ఇక అర్చకుల పదవీ విరమణ పై మే 16 2018 లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పతీసుకున్న నిర్ణయంతో రమణ దీక్షితుల తో పాటు పలువురు అర్చకులు ఉద్యోగాలను కోల్పోయిన విషయం తెలిసిందే.