సౌత్ ఇండియా సీనియర్ సినీ ప్రముఖులు రాధిక, శరత్ కుమార్ దంపతులకు చెన్నై స్పెషల్ కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.చెక్ బౌండ్స్ కేసుకు సంబంధించి నేరం రుజువు కావడంతో.
న్యాయస్థానం శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.గతంలో శరత్ కుమార్, రాధిక పలు సినిమాలు నిర్మించడం జరిగింది.
ఆ సమయంలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దగ్గరనుండి పెద్ద ఎత్తున అప్పు తీసుకోవడం జరిగింది.అయితే తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయటంతో ఆ ప్రముఖ సంస్థ ఒత్తిడి పెంచటంతో శరత్ కుమార్, రాధిక చెక్ ఇవ్వటం జరిగింది.
అయితే వారు ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో వెంటనే సదరు సంస్థ రాధిక శరత్ కుమార్ పై కేసు పెట్టడం జరిగింది.ఈ నేపథ్యంలో ఈ కేసును విచారించిన చెన్నై స్పెషల్ కోర్టు నేరం రుజువు కావడంతో .వీరిద్దరికీ ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడం జరిగింది.దీంతో ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే వీరిద్దరూ ఎన్నికలలో పోటీ కూడా చేయడం జరిగింది.