గత సంవత్సరం వచ్చిన కరోనా దేశ ప్రజల జీవితాలను కోలుకోకుండా చేసింది.కాగా ప్రస్తుతం వచ్చిన సెకండ్ వేవ్ కూడా మొదటి కరోనా కంటే బాప్లా ఉందంటున్నారు.
ఇప్పటికే చాపకింద నీరులా తన పనిని ప్రారంభించిన ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చి లాక్డౌన్ దిశగా ప్రయాణిస్తుంది.దీని ఫలితంగా దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.
ఈ క్రమంలో మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ, ఉదయం 144 సెక్షన్, వీకెండ్స్ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.కాగా ఈ నెలాఖరు వరకు ఇదే కొనసాగుతుందని అంటున్నారు అధికారులు.
మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో కూడా రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు.
ఇదిలా ఉండగా గుజరాత్ లో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపధ్యంలో రాష్ట్రం లోని 20 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట.
ఇక ఈ కరోనా ఉదృతి ఇలాగే కొనసాగితే ముందు ముందు ఇంకెన్ని ఘోరపరిస్దితులు ఎదుర్కొన వలసి వస్తుందో చూడాలి.