మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కూడా నక్శలైట్ లీడర్స్ గా కనిపిస్తారని టీజర్, ఫస్ట్ లుక్ బట్టి తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో సినిమా సెకండ్ హాఫ్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.
దేవాలయాల చుట్టూ ఈ కథని కొరటాల అల్లుకున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా కోసం ధర్మస్తలి అనే టెంపుల్ సెట్ ఒకటి వేశారు.
మెజారిటీ షూటింగ్ ఈ టెంపుల్ సెట్ లోనే తెరకెక్కిస్తూ ఉండటంతో సినిమా బ్యాక్ డ్రాప్ కూడా అదే అయ్యి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా.
రామ్ చరణ్ కి జోడీగా పూజా హెగ్డే కనిపించబోతుంది.
ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా రెమ్యునరేషన్ గట్టిగా ఇవ్వడంతో పాటు ఇద్దరు స్టార్ హీరోలు ఉన్న సినిమా కావడంతో ఎక్కువ ఆలోచించకుండా ఒకే చెప్పెసిందని బోగట్టా.
ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో సన్నివేశాలని కొరటాల తెరకెక్కించారు.త్వరలో పూజా హెగ్డే కూడా షూటింగ్ లో పాల్గోనబోతుందని తెలుస్తుంది.రామ్ చరణ్, పూజా హెగ్డే కాంబినేషన్ లో సన్నివేశాలని, అలాగే పాటని దర్మస్తలి సెట్ లోనే చిత్రీకరించేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నారు.ఈ నెల ఆఖరున పూజా హెగ్డే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.