ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది.
ఆదిపురుష్ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా 60 శాతం బడ్జెట్ గ్రాఫిక్స్ కోసమే ఉపయోగిస్తున్నారని సమాచారం.అయితే ఈ సెట్ లో ఉన్నవారికి ప్రభాస్ మన తెలుగు రుచులు రుచి చుపిస్తున్నాడంట.
అక్కడ ఉన్నవారంతా ఇప్పుడు ప్రభాస్ వంటకాలు గురించే చర్చించు కుంటున్నారంట.
ప్రభాస్ కు ఎక్కడ సినిమా చేస్తున్న తన కుక్ తో వంట చేయించుకుని తినడం అలవాటు.
ఆయన తినడం మాత్రమే కాదు.సెట్ లో ఉన్నవారికి కూడా ప్రభాస్ తన వంటకాలను రుచి చూపిస్తాడట.
అయితే ఇప్పుడు ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో అక్కడి వారికీ ప్రభాస్ మన తెలుగు రుచులను పరిచయం చేస్తున్నాడట.సెట్ లో ఉన్న నటీనటులు ఈ వంటకాల టేస్ట్ చేసి ప్రభాస్ ను మెచ్చుకుంటున్నారని సమాచారం.
ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ కొద్దీ రోజుల్లో ముగించుకుని రాధే శ్యామ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని సమాచారం.రాధే శ్యామ్ షూటింగ్ చివరి షెడ్యూల్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది.అంతేకాదు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించే సలార్ సినిమా షూటింగ్ కోసం కూడా ఏర్పాట్లు ముమ్మరం గా జరుగు తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ తో కూడా ఒక సినిమా ప్రకటించాడు.