ఉప్పెన సినిమాలో బేబమ్మగా నటించిన కృతి శెట్టితన నటనతో, అందంతో వరుస అవకాశాలను తన ఖాతాలో వేసుకుంటుంది.ఒక్క చూపుతోనే, ఒక్క నవ్వుతోనే కుర్రాళ్ల మతి పోగొట్టిన కృతి యువతల హృదయాల్లో ఒక స్థానాన్నే సంపాదించుకుంది.
కేవలం అభిమానుల్లోనే కాకుండా స్టార్ హీరోల మనసులను కూడా దోచేస్తుంది ఈ ముద్దుగుమ్మ.ఇక ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు జోడీగా కూడా చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ మొత్తానికి మొదటి సినిమాతోనే మంచి పేరును అందుకుంది.సినిమాల కంటే ముందు కృతి ఎన్నో బుల్లితెర ప్రకటనల్లో నటించగా ఒక్క సినిమాతోనే స్టార్ గా మారింది.
ఇక కృతి సుధీర్ బాబు సినిమాల్లో కూడా అవకాశాన్ని అందుకుందట.
అంతేకాకుండా లింగుస్వామిదర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటించనున్న సినిమాలో బేబమ్మ అవకాశాన్ని అందుకుంది.ఇదిలా ఉంటే మరో స్టార్ హీరో మహేష్ బాబు సరసన నటించనున్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి.ఈ బ్యూటీ మహేష్ సరసన నటించిందంటే చాలు ఇక స్టార్ హీరోయిన్ గా ముద్ర పడాల్సిందే.
మరీ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇంతకీ కృతి ఏ సినిమాలో నటిస్తుందన్న ప్రశ్నలు ఎదురవ్వగా మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట లో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నాడట.అంతే కాకుండా మరో డైరెక్టర్స్ రాజమౌళి, అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు కృతి శెట్టి ని ఎంచుకోనున్నారని తెలుస్తుంది.ఇక మొత్తానికి ఈ సినిమాలో బేబమ్మ నటిస్తే ఇక ఆమెకు తిరుగే ఉండదని అర్థమవుతుంది.