కరోనా మళ్లీ విలయ తాండవం చేస్తుంది.కరోనా తీవ్రత పెరగడంతో మహారాష్ట్రలో రాత్రి పూట కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.
అయితే పరిస్థితి తీవ్రంగా మారితే కొన్ని ప్రాంతాల వరకు పూర్తి లాక్ డౌన్ చేసినా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.ఇక తెలంగాణా రాష్ట్రంలో కూడా రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
లేటెస్ట్ గా ఒకే పోలీస్ స్టేషన్ లో ఎస్సై సహా 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకిందని తెలుస్తుంది.
బంజరా హిల్స్ పోలీస్ స్టేషన్ కరోనా విరుచుకు పడుతుంది.
ఎస్సైతో పాటుగా కొందరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలుస్తుంది.అయితే ఇదే పోలీస్ స్టేషన్ లో 50 మంది కరోనా బారిన పడ్డారు.
ఇప్పుడు మళ్లీ ఇదె పోలీస్ స్టేషన్ లో 9 మంది కానిస్టేబుళ్లు కరోనా రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో సి.
ఐ, మహిళా ఎస్సై తో పాటుగా 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ వచ్చిందని సమాచారం.కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఆంక్షలను విధిస్తున్నా స్వతహాగా మాస్క్, శానిటైజేషన్ ఉంటేనే వైరస్ బారిన పడకుండా తప్పించుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ హాస్పిటల్స్ ను మళ్లీ రెడీ చేస్తుందని తెలుస్తుంది.కేసులు ఎక్కువ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను సూచిస్తుంది.